AP పాఠశాలల్లో AADHAR స్పెషల్ క్యాంపులు

December 16, 2025 11:06 AM

రాష్ట్రంలోని పాఠశాలల్లోని విద్యార్థులకు ఆధార్ సేవలు అందించేందుకు ఆధార్ స్పెషల్ క్యాంపులను మంగళవారం (నేటి నుంచి) నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు, తిరిగి 22 నుంచి 24వ తేదీ వరకు క్యాంపులు నిర్వహించబడతాయి. గతంలో నవంబరులో నిర్వహించిన క్యాంపుల కొనసాగింపుగా, ముఖ్యంగా బయోమెట్రిక్ అప్‌డేట్ మిగిలి ఉన్న పిల్లలు, విద్యార్థుల కోసం ఈ క్యాంపులు ఏర్పాటు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,51,271 మంది విద్యార్థులు ఉండగా, గత క్యాంపులో 3,34,599 మంది నమోదు చేసుకున్నారు. ఇంకా 13,16,672 మంది విద్యార్థులు ఆధార్ నమోదు లేదా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంది.
మిగిలిన విద్యార్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ విజ్ఞప్తి చేసింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media