Andhra Pradeshలో రెవెన్యూ వ్యవస్థలో తీవ్ర సమస్యలు వెల్లడి అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 680 మండలాలు ఉండగా, వాటిలో 337 తహశీల్దార్ (ఎమ్మార్వో) పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ప్రజా సేవలు దెబ్బతింటున్నాయి.
ప్రభుత్వం ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఫిర్యాదులు పేరుకుపోతున్నాయి. ఎమ్మార్వో కార్యాలయాల్లో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో, ఇన్చార్జ్లు, డిప్యూటీ తహశీల్దార్లు తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.భూమి వివాదాలు, రెవెన్యూ రికార్డుల్లో లోపాలు, ఆక్రమణలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నప్పటికీ, వాటి పరిష్కారం ఆలస్యం అవుతోంది. కలెక్టరేట్లు, ప్రజా ఫిర్యాదు వేదికలు, రాజకీయ కార్యాలయాల వరకు ప్రజలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.ఇక మరోవైపు ప్రమోషన్ల కోసం అధికారులు ప్రయత్నిస్తుండగా, క్షేత్రస్థాయిలో విధులు నిర్లక్ష్యం అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రీ-సర్వే పనులపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల సాధారణ రెవెన్యూ సేవలు మరింత మందగిస్తున్నాయి.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖాళీల భర్తీ, పారదర్శక వ్యవస్థ అమలు చేయకపోతే ప్రజా సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
