AP :శ్రీ కాశి అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం

November 20, 2025 5:07 PM

మంగళగిరి శివాలయం సమీపంలోని మెట్ల మార్గంలో శ్రీ కాశి అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం జరిపిన అన్నదాన కార్యక్రమం భక్తులతో కిటకిటలాడింది.

ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు స్వయంగా భక్తులకు అన్నప్రసాదం అందించారు. గత 30 నెలలుగా ప్రతి అమావాస్యనాడు 4 వేల మందికి అన్నదానం చేస్తున్నామని, ఇది భక్తుల సహకారం మరియు దాతల ఉదారతతో నిరంతరంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు.

మొత్తం 40 మంది దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సాంబశివరావు పేర్కొన్నారు.
“ఆకలితో వచ్చే భక్తులు సంతృప్తిగా వెళ్లడం మా ఆనందం. భక్తుల సేవే పరమార్థం” అని ఆయన అన్నారు.

ఈ సేవా కార్యక్రమానికి స్థానికులు, భక్తులు సాంబశివరావుకు అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో పుప్పాల కోటేశ్వరరావు, గుద్ధంటి మురహరి, కగ్గా శ్రీనివాసరావు, పెరుమాళ్ళ సుబ్రహ్మణ్యం, మారం మల్లికార్జునరావు మరియు ఇతరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media