AP :గుడివాడకు ఇక VANDEBHARAT సేవలు

December 15, 2025 10:41 AM

చెన్నై-విజయవాడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నరసాపురం వరకు పొడిగించడంతో, ఇకపై గుడివాడ ప్రజలకు హైస్పీడ్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పొడిగింపు రైలు నేడు (డిసెంబర్ 15, 2025) విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్రారంభం కానుంది.

చెన్నై-విజయవాడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20677) ను నర్సాపురం వరకు పొడిగించారు.పొడిగించిన ఈ రూట్‌లో గుడివాడ రైల్వే స్టేషన్‌లో హాల్ట్ ఇచ్చారు. ఆ తర్వాత భీమవరం టౌన్‌లో కూడా ఈ రైలు ఆగనుంది.
నర్సాపురం వరకు పొడిగించిన వందేభారత్ రైలును నేడు (డిసెంబర్ 15న) విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్రారంభించనున్నారు. ఈ పొడిగింపు డిసెంబర్ 17వ తేదీ నుంచి అమలులోకి రానుంది.

షెడ్యూల్ (17 నుంచి): చెన్నైలో ఉదయం 5:30 గంటలకు బయలుదేరి, విజయవాడకు 11:45 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి గుడివాడకు మధ్యాహ్నం 12:30 గంటలకు, భీమవరం టౌన్‌కు 13:15 గంటలకు, నర్సాపురానికి 2:10 గంటలకు చేరుతుంది. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పట్టుబట్టడం వల్లే ఈ అవకాశం గుడివాడ ప్రజలకు దక్కింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media