ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి మరో భారీ విజయం లభించింది. ప్రముఖ సంస్థ వారీ ఎనర్జీస్ (Waaree Energies) రాష్ట్రంలో బ్యాటరీ గీగా-ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు రూ. 8,175 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.
ఈ ప్రాజెక్టుపై ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ క్లీన్-ఎనర్జీ ప్రయాణంలో ఇది ఒక మైలురాయి అని ఆయన అభివర్ణించారు. ఈ భారీ పరిశ్రమ ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు (EV) మరియు పునరుత్పాదక ఇంధన నిల్వ రంగంలో ఏపీ అగ్రస్థానానికి చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
