Bandi Sanjay Kumar కుమారుడు Bandi Bhagirath Saiపై నమోదైన దాడి కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. తన కుమారుడు పోలీసులకు లొంగిపోయాడని బండి సంజయ్ తెలిపారు.
మహీంద్ర యూనివర్సిటీలో సహ విద్యార్థిపై దాడి చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు కాగా, వైరల్ వీడియో ఆధారంగా దుండిగల్ పోలీసులు విచారణ చేపట్టారు. “నా కుమారుడు తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి” అని సంజయ్ పేర్కొన్నారు.ఇద్దరి మధ్య వ్యక్తిగత వివాదం కారణంగా ఈ ఘటన జరిగిందని, ప్రస్తుతం సమస్య పరిష్కారమైందని కూడా ఆయన అన్నారు. అయితే ఈ వీడియోను రాజకీయ ప్రయోజనాల కోసం లీక్ చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.ఇక బాధితుడు శ్రీరామ్ కూడా వీడియో విడుదల చేసి, తాను ఒక యువతిని వేధించిన విషయాన్ని అంగీకరించాడు. ఈ నేపథ్యంలో వివాదం మరింత చర్చనీయాంశమైంది.
