మండలం రాజులు తాళ్ళవలస గ్రామంలోని బంగారమ్మ ఆలయం లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆర్.ఆర్ బిల్డర్స్ డెవలపర్ మాకాల వెంకట అప్పారావు, సూర్యకళ దంపతులు అమ్మవారికి సుమారు లక్ష రూపాయల విలువైన వెండి కిరీటం, మంగళసూత్రాలు బహుకరించారు. మొక్కుబడిగా ఈ కానుకలు సమర్పించినట్లు వారు తెలిపారు.గ్రామంలో మేళతాళాలతో కిరీటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయానికి చేర్చి అమ్మవారికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో పి. శేషగిరిరావు, రమాదేవి దంపతులు తదితరులు పాల్గొన్నారు.భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.
