Bapatla districtలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ J. V. Vinod Kumar అధికారులను ఆదేశించారు.

శుక్రవారం Cherukupalli మండలంలోని Kavuru మరియు చెరుకుపల్లి గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.పరీక్షలు రాస్తున్న విద్యార్థుల పరిస్థితిని పరిశీలించి, పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. ప్రైవేట్ కళాశాలలో 67 మందిలో 64 మంది హాజరయ్యారని, ముగ్గురు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో కేటాయించిన 44 మంది విద్యార్థులు అందరూ హాజరయ్యారని వివరించారు. పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు, పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తును కలెక్టర్ పరిశీలించారు.
