Basaraలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాసర రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద మహారాష్ట్ర నుంచి రాంగ్ రూట్లో వస్తున్న ఇసుక టిప్పర్, Telangana State Road Transport Corporation బస్సును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రియాజ్తో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని Bhainsa ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.టిప్పర్ డ్రైవర్ ప్రమాదం అనంతరం పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
