తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆయన రాజకీయ ప్రయాణం, అభివృద్ధి దిశగా తీసుకున్న నిర్ణయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. “ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పాలన” అనే సిద్ధాంతంతో ముందుకు సాగిన ఆయనను దేశవ్యాప్తంగా దూరదృష్టి కలిగిన నాయకుడిగా గుర్తిస్తున్నారు.

ఐటీ రంగానికి పునాది వేసిన నాయకుడిగా పేరుగాంచిన చంద్రబాబు, ఈ-గవర్నెన్స్ను ప్రజలకు చేరువ చేసి పరిపాలనలో సాంకేతికతకు కొత్త దారులు చూపించారు. హైదరాబాద్ను గ్లోబల్ ఐటీ హబ్గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.

అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయనకు విశేష గుర్తింపు లభించింది. అమెరికా, బ్రిటన్, ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై ఆయన విజన్కు ప్రశంసలు దక్కాయి. ప్రముఖులు బిల్ గేట్స్, బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్ వంటి నేతలతో ఆయనకు ఉన్న అనుబంధం ఆయన ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్ర వరకు, సంక్షేమం-అభివృద్ధి రెండింటినీ సమతుల్యం చేస్తూ పాలన సాగించిన నాయకుడిగా ఆయన నిలిచారు. పరిశ్రమలు, మౌలిక వసతులు, వ్యవసాయం, ఐటీ రంగాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశాయి.రాజకీయంగా కూడా కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు, దేశ రాజకీయాల్లో ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.చంద్రన్న జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.
