Chatt puja:హుస్సేన్‌సాగర్ తీరంలో ఛఠ్ పూజా ఘనంగా

October 28, 2025 3:18 PM

హైద్రాబాద్ హుస్సేన్‌సాగర్ తీరంలో సోమవారం ఛఠ్ పూజా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గాయని శార్దా సిన్హా ఆలపించిన భక్తిగీతాలు భక్తులను మంత్ర ముగ్ధులను చేశాయి.సోమవారం ఈ నాలుగు రోజుల ఛఠ్ పండుగలో మూడో రోజు, సంధ్యా సమయం, భక్తులు నడుము వరకు నీటిలో నిలబడి సూర్యాస్తమయ వేళ ఫలాలు, చెరకు, గోధుమపిండి – బెల్లంతో చేసిన ‘తేఖువా’ వంటి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. ఆ రోజు మొత్తం ఉపవాసం కొనసాగించి, కుటుంబ సభ్యులు కలిసి భక్తి రాగాల మధ్య పూజలు నిర్వహించారు.


బీహార్, యూపీ, ఝార్ఖండ్ రాష్ట్రాల నుండి వచ్చిన వేలాది భక్తులు సూర్యదేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ పూజలు నిర్వహించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media