అల్లూరి సీతారామరాజు జిల్లాలోని Chintapalli మండలంలో కుటుంబ కలహాలు దారుణానికి దారితీశాయి. భార్యపై భర్త కత్తితో దాడి చేసి పరారైన ఘటన కలకలం రేపింది.

చౌడుపల్లి పంచాయతీ వాముగడ్డ గ్రామానికి చెందిన భాగ్యశ్రీపై, ఆమె భర్త పాపిటి నాయుడు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు కొనసాగుతుండగా, శుక్రవారం రాత్రి వివాదం తీవ్రరూపం దాల్చింది.ఆగ్రహంతో భర్త భార్యపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
