Chittoor జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు ఢీకొనడంతో కారు బస్సు కిందికి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వరంగల్కు చెందిన భర్త శ్రీధర్ రావు, భార్య లక్ష్మి, నాలుగేళ్ల కుమార్తె ఆద్వికగా గుర్తించారు.కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వారు బెంగళూరు నుంచి తిరుమల వైపు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.ప్రమాదంలో మృతదేహాలను పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, గాయపడిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనపై Bangarupalem పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
