భారత చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన రోజా (Roja) మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పిన రోజా, ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో రీ-ఎంట్రీ ఇస్తున్నారు.సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్పై, దర్శకుడు డీ.డి. బాలచంద్రన్ రూపొందిస్తున్న కొత్త తమిళ చిత్రంలో రోజా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె వయసు పైబడిన, విషాదంలో ఉన్న మహిళగా కనిపించనున్నారు.రోజా రీ-ఎంట్రీని పురస్కరించుకుని నటి ఖుష్బూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. “90s క్వీన్ రోజా తిరిగి వస్తోంది!” అనే ట్యాగ్లైన్తో వచ్చిన ఆ వీడియోలో రోజా పాత హిట్ సినిమాల క్లిప్స్తో పాటు కొత్త చిత్రంలోని సన్నివేశాలు చూపించారు.
అభిమానులు ఈ చిత్రంతో రోజా మరోసారి శక్తివంతమైన నటిగా తన సత్తా చాటబోతున్నారు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

