Rapurలోని తెలుగు గంగా అతిథి గృహంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను Kurugondla Ramakrishna పంపిణీ చేశారు.
Nellore District రాపూర్ మండలానికి చెందిన 6 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.6,79,578 సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజలకు మరిన్ని పథకాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
