సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విశాఖ పోలీసులు రూపొందించిన వీడియో ప్రచార చిత్రాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ఈ వీడియోలను ప్రదర్శించారు.
మొత్తం 24 రకాల సైబర్ మరియు ఆర్థిక నేరాలపై 24 షార్ట్ ఫిలింలను రూపొందించినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ Shankhabrata Bagchi తెలిపారు. దేశవ్యాప్తంగా సైబర్, డిజిటల్ మోసాల వల్ల ప్రజలు సుమారు రూ.30,211 కోట్లు నష్టపోయినట్లు ఆయన వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్లో 2021లో రూ.34 కోట్లు, 2022లో రూ.117.5 కోట్లు, 2023లో రూ.378 కోట్లు, 2024లో రూ.974.12 కోట్లు సైబర్ మోసాల వల్ల నష్టం జరిగినట్లు వివరించారు. 2025లో కూడా 64,048 ఫిర్యాదులు నమోదై సుమారు రూ.828 కోట్లు నష్టం జరిగినట్లు తెలిపారు.ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా అవగాహన పెంచేందుకు ఈ షార్ట్ ఫిలింలను రూపొందించినట్లు అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి Vangalapudi Anitha, డీజీపీ Harish Kumar Gupta తదితరులు పాల్గొన్నారు.
