ప్రపంచకప్లో అరుదైన ఫీట్పై ఆనందం వ్యక్తం చేసిన భారత ఆల్రౌండర్
ఐదు వికెట్లతో భారత్కు విజయపథం చూపిన Deepti Sharma
హైదరాబాద్: ఐసీసీ మహిళల ప్రపంచకప్లో పాకిస్థాన్పై ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆఫ్స్పిన్ ఆల్రౌండర్ Deepti Sharma, తన కెరీర్లో ఈ ప్రదర్శన ఎంతో ప్రత్యేకమని చెప్పారు. మ్యాచ్లో చేసిన ప్రతి పని తనకు ఆనందమే ఇచ్చిందని, అయితే ఐదు వికెట్లు పడగొట్టడం అత్యంత మధురమైన క్షణమని పేర్కొన్నారు.
యువ స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్, శ్రీ చరణికి ఇచ్చే సలహా గురించి అడిగితే, “యువ ఆటగాళ్లకు నేను ఎప్పుడూ ఒకటే చెబుతాను. మీకు ఇప్పటివరకు ఫలితం ఇచ్చిన విధానాన్నే కొనసాగించాలి. పరిస్థితులను అంచనా వేసుకోవాలి. మీ బలమైన బంతి లేదా ప్రణాళికలు ఆ వికెట్పై ఫలితం ఇస్తాయని అనిపిస్తే వాటినే నమ్మాలి. మిగతాది దేవుడిపై వదిలేయాలి. ఆత్మవిశ్వాసంతో ప్రణాళికలను అమలు చేస్తే విజయం తప్పకుండా వస్తుంది” అని చెప్పారు.
ప్రపంచకప్కు ముందు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఫీల్డింగ్, ఫిట్నెస్పై ప్రత్యేకంగా పనిచేశామని దీప్తి తెలిపారు. “రోజురోజుకూ ఆ విభాగాల్లో మెరుగుపడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ కష్టానికి నేటి మ్యాచ్లో ఫలితం కనిపించింది” అన్నారు.
“స్మృతి ముందుకు డైవ్ చేస్తూ అందుకున్న క్యాచ్ అయినా, జెమిమా పట్టిన క్యాచ్ అయినా అంత తేలికవి కావు. అయినా జట్టు అంతా అద్భుతంగా శ్రమించింది. రానున్న మ్యాచ్లకు ఇది మంచి సంకేతం. జట్టు ప్రదర్శనపై నాకు పూర్తి నమ్మకం ఉంది” అని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన దీప్తి చెప్పారు.



