ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు పలువురు ఎంపీలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఢిల్లీలో ఏపీ ఎంపీలతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన విద్యా, ఐటీ రంగాల అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీకి రావాల్సిన నిధులు, ఐటీ కంపెనీల ఏర్పాటుపై కేంద్రంతో కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
