Adilabad జిల్లా గుడిహత్నూరు నుంచి Kondagattu Anjaneya Swamy Temple వరకు హనుమాన్ దీక్షాపరులతో కలిసి ఒక శునకం సుమారు 130 కిలోమీటర్లు నడిచిన సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
కేవలం ₹5 విలువైన బిస్కెట్ ప్యాకెట్ కోసం మొదలైన ఈ ప్రయాణం, ఐదు రోజుల పాటు భక్తులతో పాటు కొనసాగింది. భక్తుల వెంట నడుస్తూ ఆ శునకం వారికి స్నేహితుడిగా మారింది.దీర్ఘ నడక కారణంగా కాళ్లకు నొప్పులు రావడంతో, భక్తులు ఆ శునకానికి సాక్సులు తొడిగించి ప్రత్యేకంగా చూసుకున్నారు. దానికి ఆహారం, విశ్రాంతి కల్పిస్తూ ఎంతో ప్రేమగా సపర్యలు చేశారు.ఈ సంఘటన భక్తి, మానవత్వం, జంతు ప్రేమకు ప్రతీకగా నిలుస్తోంది.
