ఇరాన్ రాజధాని టెహ్రాన్లో మంగళవారం 4.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఈ భూకంపం గురించి ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా నివేదించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. టెహ్రాన్, మజాందరాన్ ప్రావిన్సుల సరిహద్దు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు.
భూకంపం సంభవించిన వెంటనే టెహ్రాన్, మజాందరాన్, కోమ్ మరియు అల్బోర్స్ ప్రావిన్సుల్లోని రెడ్ క్రెసెంట్ (Red Crescent) సహాయక బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు. భూకంపం సంభవించిన గంట తర్వాత కూడా ఎటువంటి గాయాలు లేదా భారీ ఆర్థిక నష్టం నమోదు కాలేదని ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ IRIB వెల్లడించింది.
