Gas ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం.. WAR ప్రభావం

March 12, 2026 11:11 AM

Visakhapatnamలో గ్యాస్ ధరల పెరుగుదలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. Iran–Israel మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు వంటగ్యాస్ ధరలను పెంచినట్లు సమాచారం.

14.2 కిలోల నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా పెరగడంతో సాధారణ వినియోగదారులపై ఆర్థిక భారం పడింది. తాజా పెంపుతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.913కి చేరగా, ముంబైలో రూ.912.50, చెన్నైలో రూ.928.50గా నమోదైంది.గ్యాస్ ధరలు పెరగడంతో గృహ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా ధరలు మారుతుండటంతో కుటుంబాలపై అదనపు ఖర్చు భారం పడుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media