వైసీపీ కీలకనేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన ఆస్తులను అటాచ్ చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా అటాచ్ చేయబోతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న చర, స్థిరాస్తులన్నింటినీ జప్తు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని భూములు, ఇతర ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. మద్యం కుంభకోణం ద్వారా చెవిరెడ్డి కుటుంబం అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టిందని సిట్ తన విచారణలో గుర్తించింది. సుమారు రూ. 54.87 కోట్ల నల్లధనాన్ని అధికార అండతో భూ లావాదేవీల ద్వారా మళ్లించినట్టు సిట్ నిర్ధారించింది. ఈ మేరకు సిట్ చేసిన విజ్ఞప్తి ఆధారంగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అవినీతి నిరోధక చట్టం కింద ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మద్యం సిండికేట్ కేసు దర్యాప్తు వేడెక్కింది
