తన ఆరోగ్యంపై ఎలాంటి అపోహలు, ఆందోళనలు అవసరం లేదని రాష్ట్ర హోంమంత్రి Vangalapudi Anitha తెలిపారు. కొద్దిపాటి అలసట కారణంగా స్వల్ప అస్వస్థత ఏర్పడిందని, ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. తన ఆరోగ్యంపై ఆరా తీసి పరామర్శించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే తన విధులను యథావిధిగా కొనసాగిస్తానని ఆమె వెల్లడించారు.
