Ubalankaలో నిర్వహించిన హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో Bandaru Satyananda Rao పాల్గొన్నారు. 14–15 సంవత్సరాల కిశోర బాలికలు తప్పనిసరిగా హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు.

గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఈ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లో ఈ వ్యాక్సిన్ ధర సుమారు రూ.4,000 వరకు ఉంటుందని, కానీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని చెప్పారు.ఊబలంక పీహెచ్సీ పరిధిలో సుమారు 350 మంది బాలికలను గుర్తించి వారికి వ్యాక్సిన్ అందిస్తున్నట్లు వెల్లడించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.

