ఉదయం నుంచి మేఘావృత వాతావరణం.. పలుమార్లు కురిసిన జల్లులు
సాయంత్రం ప్రయాణికులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.. అప్రమత్తంగా ఉండాలని సూచనలు
HYDERABAD: హైదరాబాద్లో ఉదయం నుంచే Rain కొనసాగుతోంది. నగరంలో మేఘావృత వాతావరణం నెలకొనగా, మధ్య మధ్యలో జల్లులు కురుస్తున్నాయి.
మంగళవారం సాయంత్రం కురిసిన వర్షంతో నగర జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయింది.
ఇదే పరిస్థితి ఇవాళ కూడా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.
సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ట్రాఫిక్ను సజావుగా ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, రహదారులపై నిల్వ నీరు, తెరిచి ఉన్న మ్యాన్హోల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నగరంలో రోజంతా మోస్తరు Rain కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గాయి.
గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా నమోదుకాగా, రాత్రికి అది 22 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది.



