Intermediate సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో రోడ్డెక్కిన విద్యార్థినులు..
ఘటనలో పోలీస్ అధికారి ప్రవర్తనపై నెటిజన్ల ఆగ్రహం.,
హైదరాబాద్: సాగర్ రింగ్ రోడ్ వద్ద సోమవారం సాయంత్రం విద్యార్థినుల నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రైవేట్ జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థినులు తమకు Intermediate సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ రోడ్డుపైకి వచ్చారు.
విద్యార్థినులు మాట్లాడుతూ, సర్టిఫికెట్లు లేకపోవడంతో ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సుల అడ్మిషన్ కౌన్సెలింగ్కు హాజరుకాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిరసనను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అదిభట్ల పోలీస్ స్టేషన్కు చెందిన ఓ పోలీస్ అధికారి ఆగ్రహంతో వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి.
రోడ్డును క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఆ అధికారి విద్యార్థినులను తోసివేశారని, కొంతమంది యువకులను కూడా గట్టిగా నెట్టివేశారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. కొందరు విద్యార్థి కార్యకర్తలపై దాడి జరిగిందన్న ఆరోపణలు కూడా వినిపించాయి.
ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన కొందరు విద్యార్థినులు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొట్టడంతో పోలీస్ ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి.
నెటిజన్లు పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ఎక్స్ యూజర్ @Gouthamtime “అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకపోతే యూనిఫామ్ వేసుకోవద్దు” అని పోస్టు చేశారు.
మరో యూజర్ @ParllelWo హైదరాబాదు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ను ట్యాగ్ చేస్తూ ఆ అధికారిని సస్పెండ్ చేయాలని కోరారు.



