Hyderabadలోని Jagadgirigutta Koneru పునరుద్ధరణకు కీలక అడుగు పడింది. హైడ్రా అధికారులు కోనేరుపై ఉన్న ఆక్రమణలను తొలగించి, పూడికను పూర్తిగా శుభ్రం చేశారు.
హైడ్రా కమిషనర్ A.V. Ranganath ఆదేశాల మేరకు చేపట్టిన ఈ చర్యల్లో సుమారు 26 ట్రక్కుల నిర్మాణ వ్యర్థాలు, చెత్తను తొలగించారు. దాదాపు ఒక ఎకరా విస్తీర్ణంలో ఉన్న కోనేరును కొంతమంది మట్టితో నింపి పార్కింగ్ స్థలంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.గతంలో ఈ సమస్యపై గోవిందరాజుల స్వామి ఆలయ పూజారి Narahari వీడియో ద్వారా విజ్ఞప్తి చేయగా, దానికి స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు.22 ఏళ్లుగా కోనేరును కాపాడేందుకు పోరాడుతున్నానని, ఇప్పుడు అది ఫలించిందని పూజారి నరహరి తెలిపారు. ఈ చర్యలతో స్థానికులు, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారులను అభినందిస్తున్నారు.
