జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జమ్మలమడుగులో పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకే రాజీవ్ నగర్ కాలనీని చుట్టుముట్టిన పోలీసులు ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు.

సరైన పత్రాలు లేని 30 మోటార్ సైకిళ్లు, 8 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. పాత నేరస్తులు, అనుమానిత వ్యక్తులను గుర్తించి, ఎలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడకూడదని వారికి ఎస్డీపీఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ ఆపరేషన్లో సబ్ డివిజన్ పరిధిలోని పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు మరియు భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
