కుమమోటో ప్రాంతంలో బలమైన ప్రకంపనలు
ప్రాణనష్టం, ఆస్తినష్టం లేవు.. స్థానిక తీరాలకు మాత్రమే హెచ్చరిక
Japan: Japan దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యుషూలోని కుమమోటో ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 4:29 గంటలకు 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటన తర్వాత జపాన్ వాతావరణ సంస్థ (JMA) సునామీ హెచ్చరిక జారీ చేసింది.
JMA వెల్లడించిన వివరాల ప్రకారం, భూకంప కేంద్రం సముద్ర మట్టానికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది.
భూకంప ప్రభావంతో కుమమోటో ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు కనిపించాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం నమోదుకాలేదని అధికారులు తెలిపారు.
కుమమోటో ప్రాంతం టోక్యోకు నైరుతి దిశగా సుమారు 900 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అమెరికా US Pacific Tsunami Warning Center వెల్లడించిన సమాచారం ప్రకారం, స్థానిక తీర ప్రాంతాలకు మాత్రమే సునామీ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇతర ప్రాంతాలకు సునామీ ముప్పు లేదని తెలిపింది.



