బైక్ అదుపుతప్పి రైలింగ్ను ఢీకొట్టిన ఘటన
జూరాల ప్రాజెక్టు రోడ్డుపై ప్రమాదం
జోగులాంబ గద్వాల: Jurala ప్రాజెక్టు రోడ్డుపై జరిగిన బైక్ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. షాద్నగర్కు చెందిన ముగ్గురు యువకులు బైక్పై జూరాల ప్రాజెక్టుకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
మృతులు, గాయపడిన వ్యక్తి
మృతులను శివ (20), గణేష్ (19)గా గుర్తించారు. గాయపడిన యువకుడు శ్రీకాంత్. వీరంతా షాద్నగర్కు చెందినవారే.
స్పీడ్ బ్రేకర్ను ఢీకొట్టి అదుపుతప్పిన బైక్
బుధవారం రాత్రి ముగ్గురు యువకులు షాద్నగర్ నుంచి జూరాల ప్రాజెక్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు రోడ్డుపై బైక్ వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ను ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న రైలింగ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే వారిని గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివ, గణేష్ మృతి చెందినట్లు సమాచారం.



