కడప: రిమ్స్‌లో ACB దాడులు లంచం తో పట్టుబడ్డ ఇద్దరు ఉద్యోగులు

February 6, 2026 10:33 AM

కడప రిమ్స్ పరిపాలనా విభాగంలో అవినీతి బాగోతం బట్టబయలైంది. సదరం (SADAREM) ధ్రువీకరణ పత్రాల మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆఫీస్ సూపరింటెండెంట్ మేదర సుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు.

వికలాంగుల ధ్రువీకరణ పత్రాల జారీ కోసం వీరు బాధితుల నుండి డబ్బులు డిమాండ్ చేయగా, ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో దాడులు నిర్వహించి రూ. 30 వేలు స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకుంటుండగా పట్టుబడిన ఈ ఇద్దరినీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రిమ్స్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి.ప్రభుత్వ సేవలను సామాన్యులకు అందించడంలో లంచాలు డిమాండ్ చేస్తే ఉపేక్షించేది లేదని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media