కదిరిలో ఘనంగా శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

March 5, 2026 2:09 PM

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభ రాయుడి కళ్యాణోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది.

స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మంత్రి సవితమ్మ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజు, కలెక్టర్ శ్యాంప్రసాద్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే పరిటాల సునీత తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media