ఇంద్రకీలాద్రిపై వెలసిన Kanaka Durga Temple అమ్మవారికి భక్తులు భక్తి చాటుకున్నారు. Eluru districtలోని చింతలపూడి–మండవల్లి ప్రాంతానికి చెందిన మేడపాటి వెంకట నాగిరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఆలయ అభివృద్ధి, అమ్మవారి అలంకరణ కోసం విలువైన విరాళాన్ని అందజేశారు.
దాతలు ఆలయ అధికారులను కలిసి 32.500 గ్రాముల సూత్రాలను సమర్పించారు. వీటి విలువ సుమారు రూ.5,32,500గా ఉంటుంది. ఈ విరాళాన్ని ఆలయ చైర్మన్, పాలకమండలి సభ్యుల సమక్షంలో ఆలయ అధికారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి ప్రత్యేక ఆశీర్వచనం చేశారు.
