ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనను అరెస్ట్ చేశారంటూ వస్తున్న వార్తలను ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఉదయం నుంచి తాను ఇంట్లోనే ఉన్నానని, నా అరెస్ట్పై జరుగుతున్న ప్రచారమంతా పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల ఇళ్లలో ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావును కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆయన ఈ అరెస్ట్ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు.

