Krishna districtలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను కొనుగోలు చేసి వారికి చేయూత అందించాలని జిల్లా కలెక్టర్ DK Balaji కొనుగోలుదారులను కోరారు.

Kanuruలోని Siddhartha Engineering Collegeలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో “కొనుగోలుదారులు–అమ్మకందారుల సమ్మేళనం” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు, పారిశుద్ధ్య ద్రవ పదార్థాలు, ఆకు పళ్లెములు తదితర గృహోపకరణాలు ప్రదర్శనకు ఉంచారు.

మొత్తం 197 ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయగా మహిళా వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి కొనుగోలుదారులను ఆకట్టుకున్నారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.ఇలాంటి సమ్మేళనాల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయని, కొనుగోలుదారులు కూడా నాణ్యమైన ఉత్పత్తులను నేరుగా పొందే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

