AP :కుప్పం CM జిల్లాలో రోడ్డు ప్రమాదం

December 6, 2025 11:15 AM

బిదనపల్లి సమీపంలో కుప్పం-కృష్ణగిరి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఒకటి రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందలోకి దూసుకెళ్లడంతో రైతు తీవ్రంగా నష్టపోయాడు.

రైతు సరస్వతి తన గొర్రెలను తోలుకుంటూ రోడ్డుపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరికొన్ని గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనంతో సహా అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ ఘటనతో రైతు సరస్వతి తీవ్ర వేదనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media