కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మంగళవారం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరియు ప్రముఖ సినీ నటి రవీనా టాండన్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ఆలయానికి చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని వారికి అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.
