భూత్పూర్ మండలం ఎల్కిచర్ల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో తల్లి తన ముగ్గురు పిల్లలను బావిలో తోసి, అనంతరం తాను కూడా దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.
ఈ ఘటనలో తల్లి జంగమ్మ (40)తో పాటు కుమార్తెలు జ్యోతి (14), శైలజ (12) మృతి చెందారు. అయితే కుమారుడు జస్వంత్ బావిలో ఉన్న చెట్టు వేర్లను పట్టుకుని ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం.వ్యవసాయ పొలంలో రెండో బోరు వేయాలన్న విషయంలో భర్త బీరయ్యతో జరిగిన వాగ్వాదం అనంతరం ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
