Vijayawadaలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఐపీఎస్ అధికారి Mallika Garg మహిళలకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మహిళా అధికారుల ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా మలికా గార్గ్ మాట్లాడుతూ మహిళలు తమ సామర్థ్యాన్ని గుర్తించి ధైర్యంగా ముందుకు సాగితే ఏ రంగంలోనైనా అగ్రస్థానానికి చేరుకోవచ్చని అన్నారు. ఆత్మవిశ్వాసం, విద్య, ఆర్థిక స్వావలంబనతో మహిళలు అన్ని సవాళ్లను ఎదుర్కొనగలరని పేర్కొన్నారు.

కార్యక్రమానికి P. Krishnaiah అధ్యక్షత వహించగా, Dr. Sravanthi పాల్గొని మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
