Potti Sreeramulu 125వ జయంతి సందర్భంగా Mandapetaలో ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే Vegulla Jogeswara Rao పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వాకచర్ల గుప్తా, మండపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కాళ్లకూరి శ్రీనివాస్, కౌన్సిలర్ కాళ్లకూరి స్వరాజ్య భవాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం 200 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని, ఆయన పోరాటం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
