Markapuramలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తించారు.
గుంటూరు నుంచి వచ్చిన డీఎన్ఏ నివేదికల సహాయంతో వైద్యులు మృతదేహాలను కుటుంబ సభ్యులతో సరిపోల్చి గుర్తింపు చేపట్టారు. ఈ ప్రక్రియలో పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేశారు.గుర్తింపు అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించి, అంబులెన్సుల ద్వారా వారి స్వస్థలాలకు తరలించారు.ఈ నెల 26న రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
