రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తన పుట్టినరోజు సందర్భంగా సతీసమేతంగా దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందిన మంత్రి, తన మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు.భక్తులతో కలిసి సాధారణంగా దర్శనం చేసుకున్న మంత్రి, దేవాలయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
