మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాకు చెందిన ఒక జంట స్వేచ్ఛగా బతకడం కోసం గుజరాత్కు పారిపోగా, అక్కడ ఒక దారుణమైన పరువు హత్య చోటుచేసుకుంది. ఆ మహిళను ఆమె బంధువులు దారుణంగా హత్య చేయగా, ఆమె ప్రియుడు తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.రజినీ ధాకడ్, సంతోష్ జాతవ్ అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. వారు వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే రజినీ అగ్రవర్ణానికి చెందిన యువతి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు.
జూన్ 7వ తేదీన రజినీ, సంతోష్ గుజరాత్లోని సబర్కాంత జిల్లాకు పారిపోయి వివాహం చేసుకున్నారు. పెళ్లయిన మూడు రోజుల తర్వాత (జూన్ 11న), రజినీ తమ్ముడు వారు ఉంటున్న ఇంటిని కనిపెట్టాడు. పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకుని గుజరాత్ నుండి మధ్యప్రదేశ్కు తరలిస్తున్నారు. అదే సమయంలో తీవ్ర కోపంతో ఉన్న రజినీ సోదరుడు ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఇదే తరహాలో సంతోష్ను కూడా చంపడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రజినీ ప్రాణాలు కోల్పోగా, సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది.


