Narsipatnamలోని Sri Nookambika Ammavaru ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా గంగ కలశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ Chintakayala Ayyannapatrudu మరియు ఆయన సతీమణి ఆధ్వర్యంలో నిర్వహించారు.
పట్టణంలోని మహిళా భక్తులు భారీగా పాల్గొని నెత్తిపై కలశాలతో కోలాట నృత్యాల మధ్య ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. అమ్మవారి నూతన ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ఈ గంగ కలశ వేడుక భక్తి శ్రద్ధల మధ్య సాగింది.
