విశాఖపట్నంలో ఐఎన్ఎస్ డేగాలోకి చేరుకున్న ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్కు గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ ఘనస్వాగతం పలికారు. కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా ఉప రాష్ట్రపతిని ఆహ్వానించారు.
త్వరలో ఏయూ ప్రాంగణంలో జరిగే సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్కు ఆయన చేరుకోనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ భాగస్వామ్య సదస్సును ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు.



