తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ మరియు ఎంపీ ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు.

హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని సీఎం రేవంత్ రెడ్డి వారికి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ భేటీలో, రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి ముఖ్యమంత్రి వారికి వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీలు మరియు ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ భేటీలో పాల్గొన్నారు.
