నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని తూమాయి గ్రామంలో డాక్టర్ B. R. Ambedkar జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త Nedurumalli Ram Kumar Reddy అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
