వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి నేడు కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు.ఉదయం 9 గంటల నుంచి వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులను కలుసుకోనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం ప్రకటనలో తెలిపింది.పార్టీకి సంబంధించిన అంశాలు, స్థానిక సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
