నిజామాబాద్ గంజాయి స్మగ్లర్ల దాడి మహిళా కానిస్టేబుల్‌పై కారుతో డి

January 24, 2026 3:44 PM

జిల్లాలో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్ సిబ్బందిపైకి కారును దూకించి హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ గాజుల సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు.

నిర్మల్ జిల్లా నుండి కారులో (TS 24 F 4892) గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో సీఐ స్వప్న నేతృత్వంలోని ఎక్సైజ్ బృందం మాధవనగర్ వద్ద రూట్ వాచ్ నిర్వహించింది.స్మగ్లర్లు పోలీసులను చూసి తప్పించుకోవాలనే ఉద్దేశంతో కారును ఆపకుండా వేగంగా ఎక్సైజ్ సిబ్బందిపైకి దూకించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కిడ్నీలు దెబ్బతినడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తప్పించుకునే క్రమంలో కారు స్తంభాన్ని ఢీకొట్టడంతో స్మగ్లర్లు పట్టుబడ్డారు. నిందితులను నిర్మల్ జిల్లాకు చెందిన సయ్యద్ సోహిల్, మహమ్మద్ సోఫియోద్దీన్గా గుర్తించి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media