ODISHA DGP సమక్షంలో 11 మంది మావోయిస్టులు సరెండర్

March 16, 2026 12:38 PM

రాష్ట్ర డీజీపీ Y. B. Khurania సమక్షంలో మొత్తం 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కలహాండి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో డివిజనల్ కమిటీ సభ్యుడు నకుల్ సహా ఈ మావోయిస్టులు సరెండర్ అయ్యారు.

లొంగిపోయిన వారిలో ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు, ఐదుగురు పార్టీ క్యాడర్లు ఉన్నారు. వీరు ఒక AK-47, ఒక INSAS, నాలుగు SLR రైఫిళ్లు, నాలుగు సింగిల్ షాట్ తుపాకులు మరియు భారీ మందుగుండు సామాగ్రిని పోలీసులకు అప్పగించారు.మహారాష్ట్రకు చెందిన నకుల్ ఒడిశా రాష్ట్ర కమిటీలో డీసీఎంగా పనిచేస్తూ ఉండగా, అతనిపై రూ.22 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media